హైదరాబాద్ : ట్రాఫిక్ ఉల్లంఘనలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ నెల 15 నుంచి 21 మధ్య రాచకొండ ట్రాఫిక్ పోలీసులు వారం రోజుల వ్యవధిలో 39వేల కేసులను నమోదు చేశారు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన వారికి రూ.1.70కోట్లకుపైగా జరిమానాలు విధించారు. వారంలో 78 రహదారి ప్రమాదాలు చోటు చేసుకోగా.. 22 మంది వ్యక్తులు జీవితాలను అర్ధాంతరంగా చాలించారు. నిర్లక్ష్యం, ర్యాష్ డ్రైవింగ్, మద్యం మత్తులో వాహనాలు నడుపడమే ప్రమాదాలు కారణమని అధికారులు పేర్కొన్నారు. అధికారుల తెలిపిన వివరాల ప్రకారం.. నగరం అంతటా నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్లో మోటారు వాహన చట్టం ప్రకారం.. 39,858 కేసులు నమోదు చేసి, రూ.1,75,58,415 జరిమానా విధించినట్లు అధికారులు పేర్కొన్నారు.