రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టుల నిర్మాణం కోసం కేటాయించిన అటవీశాఖ
హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): భూములకు ప్రత్యామ్నాయంగా కేటాయించిన భూముల్లో అభివృద్ధి చేసిన అటవీ ప్రాంతాన్ని ఫారెస్ట్ ప్రాంతంగా ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం బేగంపేట గ్రామంలోని సర్వే నంబర్ 216/2లో 41.682 హెక్టార్లు, నారాయణపూర్ మండలం జనగాం గ్రామంలోని సర్వే నంబర్ 210/2లో 75.168 హెక్టర్లు, వావిళ్లపల్లి గ్రామంలో సర్వే నంబర్ 279/2లో 172.805 హెక్టార్లు, సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ రేంజ్ రఘునాథపల్లిలో సర్వే నంబర్ 201/2లో 20.235 హెక్టార్లు అటవీ ప్రాంతంగా ప్రభుత్వం నోటిఫై చేసింది. ఈ మేరకు అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏ శాంతికుమారి బుధవారం ఉత్తర్వులు జారీచేశారు.