శంషాబాద్ రూరల్, జూన్ 20 : శంషాబాద్ ఎయిర్పోర్టులో ఓ ప్రయాణికుడి నుంచి కిలో బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. ఈ బంగారం మార్కెట్ విలువ రూ.53.77 లక్షలు ఉంటున్నదని పేర్కొన్నారు. సోమవారం దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చిన ప్రయాణికుడిపై అనుమానంతో కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేశారు. దాంతో అతని వద్ద నీ క్యాప్లలో పేస్టు రూపంలో ఉన్న బంగారాన్ని గుర్తించారు. ప్రయాణికుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.