వికారాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మీర్జాపూర్ గ్రామపంచాయతీ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 20లో 2007లో తాము కొన్న పదెకరాల భూమిలో ఎకరం తగ్గిందని హైదరాబాద్ మేయర్, విజయలక్ష్మీ, ఆమె తమ్ముడు వెంకటేశ్వరరావు తెలిపారు. బుధవారం సర్వే చేయించగా ఎకరం భూమి పక్కనే ఉన్న వాళ్ల కబ్జాలో ఉన్నట్టు తెలిందని అన్నారు. ఈ విషయమై అతడిని నిలదీస్తే, మరికొంతమందితో కలిసి మీడియాను పిలిచి రచ్చచేశాడని పేర్కొన్నారు. తాము కొనుగోలు చేసిన భూమికి సంబంధించి అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయని, తాము ఎవ్వరినీ బెదిరించలేదని చెప్పారు. ఈ విషయమై మేయర్ విజయలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు.