హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): ‘పశ్చిమ తెలంగాణ సాహిత్యం -కన్నడ భాష ప్రభావం’ అన్న అంశంపై పరిశోధనకు అసిస్టెంట్ ప్రొఫెసర్ కోటకొండ రాఘవేంద్రరావుకు ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ ప్రకటించింది. కూకట్పల్లి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో తెలుగు విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న రాఘవేంద్రరావు తెలుగు ఓరియంటల్ విభాగంలో ప్రొఫెసర్ జ్యోత్స్నప్రభ పర్యవేక్షణలో పరిశోధన చేశారు. ఈ సందర్భంగా బుధవారం కళాశాల ప్రిన్సిపాల్ అలివేలు మంగమ్మ, అధ్యాపక బృందం ఆయనను అభినందించారు.