Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంఈ, ఎంటెక్ కోర్సుల పరీక్షా ఫలితాల రివాల్యుయేషన్కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని విభాగాల ఎంఈ, ఎంటెక్ (ఏఐసీటీఈ) మొదటి, మూడో సెమిస్టర్ మెయిన్, బ్యాక్లాగ్ పరీక్షా ఫలితాలను ఇప్పటికే విడుదల చేశామని చెప్పారు. విద్యార్థులు తమ మార్కు మెమోలను రెండు వారాల తరువాత నుంచి సంబంధిత కళాశాలల్లో తీసుకోవాలని సూచించారు.
ఈ ఫలితాలపై రివాల్యుయేషన్కు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఒక్కో పేపర్కు రూ.800 చొప్పున చెల్లించి ఈ నెల 12వ తేదీలోగా టీఎస్ ఆన్లైన్ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. రూ.200 అపరాధ రుసుముతో 14వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. జవాబు పత్రాల నకలు పొందగోరువారు ఒక్కో పేపర్కు రూ.1000 చొప్పున చెల్లించి ఈ నెల 14వ తేదీలోగా తమ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Research | ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ టాయిలెట్ కుండీల కంటే అశుద్ధమట..!
Health Tips | ఊబకాయంతో విసిగిపోతున్నారా.. అయితే ఈ చిట్కాలు మీ కోసమే..!