హైదరాబాద్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): గోషామహల్ స్టేడియంలో ఉస్మానియా దవాఖాన నూతన భవన నిర్మాణానికి ప్రణాళిక రూపొందించాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. సంబంధిత శాఖల అధికారులతో ఆదివారం సమీక్ష నిర్వహించారు. దవాఖానకు కావలసిన మౌలిక సదుపాయాలు, తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ వ్యవస్థకు సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.
దవాఖానకు వెళ్లే రహదారుల నిర్మాణానికి పలు సూచనలు చేశారు. అన్ని శాఖలను సమన్వయం చేయడానికి నోడల్ ఆఫీసర్గా సీనియర్ ఐఏఎస్ అధికారి దానకిషోర్ను నియమించారు. సమావేశంలో సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్రెడ్డి, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్, సిటీ కమిషనర్ సీవీ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.