హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): లింగమార్పిడి శస్త్ర చికిత్సలతో మరో రికార్డు సృష్టించేందుకు ఉస్మానియా దవాఖాన సిద్ధమైంది. ఉస్మానియాలో ఇటీవల ప్రారంభమైన ట్రాన్స్జెండర్ క్లినిక్తోపాటు లింగమార్పిడి శస్త్రచికిత్సలకు అనుమతి లభించినట్టు దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ బీ నాగేందర్ వెల్లడించారు.
పురుషులుగా మారేందుకు ఇటీవల ఇద్దరు మహిళలు దరఖాస్తు చేసుకోగా, వారి లింగమార్పిడికి అవసరమైన ప్రక్రియను ఇప్పటికే మొదలు పెట్టామని చెప్పారు. ప్రస్తుతం ఆ ఇద్దరు మహిళలకు హార్మోనల్ మార్పిడి చికిత్స మొదలైందని వివరించారు.