ఆసిఫాబాద్, డిసెంబర్ 7: నిస్సహాయ స్థితిలో ఉన్న మధ్యప్రదేశ్ రాష్ర్టానికి చెందిన మహిళకు సఖి కేంద్రం ని ర్వాహకులు చేయూతనందించారు. కు మ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారి సావిత్రి గురువారం వెల్లడించిన వివరాల ప్రకా రం.. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కా గజ్నగర్ పట్టణం సంజీవనగర్ కాలనీ లో గత నెల 30న చంటి బిడ్డతో గుర్తుతెలియని మహిళ సంచరిస్తుండగా స్థా నికులు అధికారులకు సమాచారం అం దించారు.
దీంతో సఖి కేంద్రం కౌన్సిలర్ సుమలత, సత్యశీల, ఐటీ కార్తీక్ అకడికి చేరుకున్నారు. ఆమెను స్థానిక ప్రభుత్వ దవాఖానలో చేర్పించి చికిత్స చేయించారు. అనంతరం ఆ మహిళను విచారించగా.. తన పేరు భగవంతబా యి అని తెలిపింది. ఆమె భర్త శ్యాంలా ల్ మధ్యప్రదేశ్లోని మానస జిల్లాలో ఉంటాడని చెప్పగా.. వెంటనే నిర్వాహకులు ఆయనకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. గురువారం వారి మధ్య ఉన్న విభేదాలను తొలిగించేందుకు కౌన్సెలింగ్ నిర్వహించి సొంత రాష్ర్టానికి పంపించినట్టు తెలిపారు.