హైదరాబాద్, మార్చి16 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం 9 కులవృత్తుల కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈబీసీలకు ప్రత్యేక సంక్షేమ బోర్డును, గంగపుత్ర, మేర, లింగాయత్, పెరిక, పద్మశాలి, మున్నూరుకాపు, యాదవ కురుమ, ముదిరాజ్ కులాల కార్పొరేషన్లను కోఆపరేటివ్ సొసైటీ కింద ఏర్పాటుచేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది.