బంజారాహిల్స్, ఏప్రిల్ 20: వరి పంటకు తీవ్ర నష్టం కలిగించే సుడిదోమ నివారణకు జపాన్కు చెందిన అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన అర్కెస్ట్రా పెస్టిసైడ్ను ఆవిష్కరించినట్టు జాప్కు చెందిన నిహాన్ నొహియాకూ కంపెనీ భారతీయ అనుబంధ సంస్థ నిచినో ఇండియా ప్రకటించింది.
బుధవారం హైదరాబాద్ బంజారాహిల్స్లోని హయత్ ప్లేస్ హోటల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అర్కెస్ట్రా పెస్టిసైడ్ను ఆవిష్కరించిన అనంతరం సంస్థ ఎండీ టొమూక నచిరో మాట్లాడుతూ.. వరి పంటలో సుడిదోమ సమస్యతో భారీ నష్టం ఏర్పడుతున్నదన్నారు. దీని నివారణకు ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న మందులను 6 నుంచి 7 సార్లు పిచికారీ చేయాల్సి వస్తున్నదని, దీనివల్ల సుడిదోమతోపాటు పంటకు మేలుచేసే మంచి క్రిమికీటకాలు కూడా చనిపోతున్నాయని చెప్పారు. వ్యవసాయానికి ఊతమిచ్చే ఈ మిత్ర పురుగులు నాశనం కాకుండా సుడిదోమను దీర్ఘకాలికంగా నివారించడంతోపాటు మేలుచేసే క్రిమికీటకాలు క్షేమంగా ఉండేలా చూసే మిశ్రమాన్ని తమ సంస్థ తయారు చేసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు ఎం భలేరావు, సీవోవో డీజీ షెట్టి, హేమంత్సింగ్ తదితరులు పాల్గొన్నారు.