హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణ యువతకు విదేశాల్లో మరి న్ని ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని సీఎస్ సోమేశ్కుమార్ అధికారులను ఆదేశించారు. విదేశాల్లో ఉపాధి కల్పించే అంశంపై వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులతో గురువారం బీఆర్కేభవన్లో సీఎస్ సమావేశమయ్యారు. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్పవర్ కార్పొరేషన్ (టామ్కామ్)ను బలోపేతం చేయడానికి సలహామండలిని ఏర్పాటు చేయాలని చెప్పారు.
విదేశాల్లో నర్సిం గ్ విద్యార్థులకు ఎక్కువగా అవకాశాలున్నాయన్నారు. ఎక్కువమంది నర్సింగ్ విద్యార్థులు విదేశాలకు వెళ్లడానికి పరీక్షలురాసేలా ప్రణాళిక రూపొందించాలని వైద్యారోగ్యశాఖ అధికారులకు సూచించారు. ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్న కోర్సులను షార్ట్లిస్ట్ చేయాలని ఆదేశించారు. పాఠ్యాంశాలు, కమ్యూనికేషన్ స్కిల్స్పై ఇంగ్లిష్లో బోధించడానికి రిసోర్స్ పర్సన్స్ను గుర్తించాలన్నారు.
సమావేశంలో కార్మికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని, పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్రంజన్, కాలేజీ, టెక్నికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్మిట్టల్, వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, పంచాయతీరాజ్శాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, కార్మికశాఖ కమిషనర్ నదీమ్అహ్మద్, పరిశ్రమలశాఖ కార్యదర్శి విష్ణువర్ధన్రెడ్డి, డీఎంఈ రమేశ్రెడ్డి, నిమ్స్ డైరెక్టర్ మనోహర్, టాస్క్ సీఈవో శ్రీకాంత్ సిన్హా, సీఎం ఓఎస్డీ గంగాధర్ పాల్గొన్నారు.