హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): మొదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఖమ్మం జిల్లా బస్వాపురం గ్రామానికి చెందిన 14 నెలల చిన్నారి ఆపరేషన్కు మంత్రి కేటీఆర్ సాయం అందించారు. ‘బిడ్డకు చికిత్స చేయించుకొనే స్త్తోమత లేని తల్లిదండ్రులు సాయం కోసం ఎదురు చూస్తున్నారు’ అని మే 6న ఓ నెటిజన్ చేసిన ట్వీట్పై కేటీఆర్ స్పందించారు.
తన కార్యాలయం అవసరమైన సాయం అందిస్తుందని భరోసా ఇచ్చారు. దీంతో చిన్నారికి కొన్ని రోజుల క్రితం హైదరాబాద్లోని రెయిన్బో దవాఖానలో ఆపరేషన్ జరిగింది. ప్రస్తుతం పాప కోలుకొంటున్నది. దీంతో కుటుంబ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వారి సంబంధీకులలో ఒకరు .. ‘మీరు త్వరగా స్పందించినందుకు ధన్యవాదాలు కేటీఆర్ సార్. మీలాంటి మంచి మనసున్న వారి సాయంతో పాపకు ఆపరేషన్ జరిగింది. వేగంగా కోలుకుంటున్నదని చెప్పడానికి సంతోషంగా ఉంది. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు’ అని ట్వీట్ చేశారు. దీనికి స్పందించిన మంత్రి కేటీఆర్ స్మైలీ ఎమోజీని ట్వీట్ చేశారు.