హైదరాబాద్, అక్టోబర్ 14(నమస్తే తెలంగాణ): దేశంలో నిరుద్యోగం ఆరేండ్ల కనిష్ఠానికి చేరిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ గొప్పలు చెబుతున్నా వాస్తవాలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఐటీఐల్లో నైపుణ్య శిక్షణ పొందిన అభ్యర్థుల్లో 0.09శాతం మందికి మాత్రమే ఉద్యోగాలు లభించడం ఇందుకు నిదర్శనం. నీతి ఆయోగ్ ఇటీవల తమ నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. వాస్తవాలు ఇలా ఉంటే, మోదీ మాత్రం తన హయాంలో ‘కౌశల్ వికాల్ స్కీం’ పేరుతో కోటిన్నరమందికి శిక్షణ అందించినట్టు గొప్పలు చెప్పుకోవడం విడ్డూరం. దేశంలోని ఐటీఐల్లో సగటున 70శాతం ఇన్స్ట్రక్టర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీరిలో 15శాతం మంది మాత్రమే తగిన విద్యార్హతలు, శిక్షణ పొంది ఉన్నట్టు నివేదిక పేర్కొంది. కొన్ని కాలేజీల్లో 100శాతం ఇన్స్ట్రక్టర్ల పోస్టులు ఖాళీగా ఉన్నట్టు వివరించింది. వాస్తవాలు ఇలావుంటే ప్రధాని మోదీ మాత్రం దేశంలో నిరుద్యోగం ఆరేండ్ల కనిష్టానికి చేరుకున్నదని ఇటీవల ఢిల్లీలో జరిగిన కౌశల్ వికాస్ శిక్షణ కార్యక్రమంలో పేర్కొనడం గమనార్హం.
తెలంగాణలో 17లక్షల ఉద్యోగాలు
కేంద్రం నుంచి ఎలాంటి సహకారం లభించకున్నా రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటు కోసం పెద్ద ఎత్తున చర్యలు చేపడుతున్నది. తొమ్మిదిన్నరేండ్లలో రాష్ర్టానికి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా కలిపి 23వేల పరిశ్రమలు రాగా, వాటి ద్వారా దాదాపు 17 లక్షలకుపైగా ఉద్యోగాల కల్పన జరిగింది.
నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం