కాచిగూడ, జూలై 4: నేషనల్ అకాడమీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ సంస్థ ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హాకింగ్ కోర్సుల్లో ఆన్లైన్ శిక్షణ కోసం ఆసక్తి గల యువతీ, యువకుల నుంచి దరఖాస్తులను కోరుతున్నట్టు సంస్థ డైరెక్టర్ విమలారెడ్డి తెలిపారు. హైదరాబాద్ కాచిగూడలో మంగళవారం విలేకరులతో ఆమె మాట్లాడారు.
సైబర్ సెక్యూరిటీ కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులకు దేశ, విదేశాల్లో విస్తృతమైన ఉపాధి అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు. ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్, డిప్లొమా అర్హత గల యువతీ, యువకులు ఈ నెల 19లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు 7893141797, ఆన్లైన్లో www.nacsindia.orgలో సంప్రదించాల్సిందిగా కోరారు.