కాచిగూడ,మే 28: సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హాకింగ్ కోర్సుల్లో ఆన్లైన్ శిక్షణకు ఆసక్తి ఉన్న నిరుద్యోగులు జూన్ 9లోపు దరఖాస్తు చేసుకోవాలని నేషనల్ అకాడమీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ సంస్థ డైరెక్టర్ విమలారెడ్డి సూచించారు.
ఈ శిక్షణకు ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజినీర్, పాలిటెక్నిక్, డిప్లొమా చదివినవారు అర్హులు అని పేర్కొన్నారు. సైబర్ సెక్యూరిటీ కోర్సు లు పూర్తి చేసిన అభ్యర్థులకు దేశ, విదేశాలలో ఉపాధి అవకాశాలు లభిస్తున్నట్టు చెప్పారు. వివరాలకు 7893 141797, www.nacsindia. orgను సంప్రదించాలని కోరారు.