హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ) : సివిల్స్ అభ్యర్థులకు 20న ఆన్లైన్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామ్ను నిర్వహించనున్నట్టు ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఐఏఎస్ అకాడమీ చైర్మన్ కృష్ణప్రదీప్ తెలిపారు.
ఈ ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన వారికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా అవార్డులను అందజేస్తామని పేర్కొన్నారు. వివరాలకు 040 -35052121 సంప్రదించాలని సూచించారు.