హైదరాబాద్ : ఈ నెల 24 నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. 8, 9, 10 తరగతులకు ఆన్లైన్లో పాఠాలు బోధించాలని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కొవిడ్ నేపథ్యంలో సిబ్బంది 50శాతం మాత్రమే విధులకు హాజరు కావాలని, రొటేషన్ పద్ధతిలో 50శాతం సిబ్బంది మాత్రమే హాజరుకావాలని సూచించింది.