టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితారామచంద్రన్
హైదరాబాద్, మార్చి 30 : టీఎస్పీఎస్సీ జారీచేసే ఉద్యోగాల నోటిఫికేషన్లకు వన్ టైం రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) తప్పనిసరి కమిషన్ కార్యదర్శి అనితారామచంద్రన్ తెలిపారు. ఓటీఆర్తో సులభంగా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ఈ నెల 28 నుంచి ఓటీఆర్లో ఎడిట్ అవకాశం కల్పించామని, గతంలో దరఖాస్తు చేసుకున్న వారు రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం స్థానికతను మార్చుకోవడంతోపాటు విద్యార్హతలను జతపర్చుకోవచ్చని తెలిపారు. కొత్తవారు సైతం దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. త్వరలోనే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీచేయనున్నామని, ఓటీఆర్లో మార్పులు, కొత్త ఓటీఆర్ నమోదుకు ఇదే సరైన సమయమని చెప్పారు.