యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తికమాసంతోపాటు ఆదివారం సెలవురోజు కావడంతో దాదాపు లక్ష మంది భక్తులు ఆలయానికి తరలిచ్చారు. ధర్మ దర్శనానికి 8 గంటలు, ప్రత్యేక దర్శనానికి 6 గంటల సమయం పట్టింది.
గుట్ట పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. దేవాలయ చరిత్రలో ఒకే రోజు రికార్డు స్థాయిలో స్వామివారి ఖజానాకు. రూ.1,09,82,446 ఆదాయం సమకూరినట్టు ఈవో గీత తెలిపారు.
– యాదాద్రి