కామారెడ్డి, దేవరకద్ర, జనగామ నియోజకవర్గాల్లో బుధవారం బీసీ కుల వృత్తిదారుల లబ్ధిదారులకు లక్ష సాయం చెక్కులను పంపిణీ చేశారు. కామారెడ్డి కలెక్టరేట్లో కామారెడ్డి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, మహబూబ్నగర్ జిల్లాలోని దేవరక్రదలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి, జనగామలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి లబ్ధిదారులకు రూ.లక్ష సాయం చెక్కులను పంపిణీ చేశారు. ఒక్కో నియోజకవర్గంలో 300 మంది లబ్ధిదారులకు చెక్కలు అందజేశారు. జనగామలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి పూలాభిషేకం చేశారు.
-కామారెడ్డి/జనగామ, నమస్తే తెలంగాణ/దేవరకద్ర