మ్యాప్మైజినోమ్, జైమో సంస్థల విరాళం
హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): మ్యాప్మైజినోమ్, జైమో సంస్థలు రాష్ర్టానికి లక్ష అధునాతన కొవిడ్ టెస్ట్ కిట్లను విరాళంగా ఇచ్చాయి. బుధవారం జైమో రిసెర్చ్ సంస్థ బిజినెస్ డెవలప్మెంట్ వైస్ ప్రెసిడెంట్ మార్క్వాన్ ఎడెన్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ను కలిసి కిట్లను అందించారు. భారత్కు 10 లక్షల కిట్లు అందించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకున్నది. పెద్ద రాష్ర్టాలకు వీటిని అందిస్తున్నది. ఈ టెస్ట్ కిట్లు మిగతావాటితో పోల్చితే త్వరగా, ఖచ్చితమైన ఫలితాన్ని ఇస్తాయని సంస్థ ప్రతినిధులు తెలిపారు. కిట్లలో డీఎన్ఏ/ఆర్ఎన్ఏ షీల్డ్ డైరెక్ట్ డిటెక్ట్ మెకానిజం ఉన్నట్టు చెప్పారు. కొవిడ్ పోరులో తాము ముందు వరుసలో ఉన్నామని, ఇది తమ బాధ్యతని మ్యాప్మైజినోమ్ సంస్థ సీఈవో అను ఆచార్య తెలిపారు.