కోరుట్ల: జగిత్యాల జిల్లా కోరుట్లలో రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం పట్టణ శివార్లలోని పూల్ వాగు బ్రిడ్జిపై వేగంగా వెళ్తున్న కారు డివైడర్ను ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఒకరు మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతిచెందిన వ్యక్తిని కోరుట్లలోని అంబేద్కర్నగర్ కాలనీకి చెందిన గడ్డం మణిగా గుర్తించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.