నిజామాబాద్: జిల్లాలోని మోర్తాడ్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని దోన్కాల్ క్రాస్ రోడ్డు వద్ద హైవేపై వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్నవారిలో ఒకరు మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.