నల్లగొండ: నల్లగొండ జిల్లా చింతపల్లిలో (Chintapalli) రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేటు ట్రావెల్స్కు చెందిన ఓల్వో బస్సు (Volvo Bus) చింతపల్లి శివారులో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఓ మహిళ మృతిచెందగా మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా వినుకొండలో జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరై తిరిగి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు.
మరో ఘటనలో రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మండలం నందిగామ వద్ద ఆర్టీసీ బస్సు ఓ కంటైనర్ను ఢీకొట్టింది. దీంతో బస్సు డ్రైవర్ సహా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటాన స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. ఈ రెండు ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.