హన్మకొండ/జగిత్యాల: హన్మకొండలోని బాలసముద్రంలో రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున బాలసముద్రంలో ఓ బైకును ఢీకొట్టిన జీపు.. అప్పటికీ ఆగకపోవడంతో అదుపు తప్పి ప్రక్కనే ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లింది. దీంతో కారును నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. ఈ ఘనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మద్యం మత్తులో కారునడపంతోనే ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు.
మరో ఘటనలో జగిత్యాలో బైకును ఢీకొట్టిన కారు ట్రాన్స్ఫార్మన్ను గుద్దింది. జగిత్యాలలోని గాంధీనగర్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ కారును పోలీసులు ఆపారు. అయితే ఆగకుండా వేగంగా దూసుకొచ్చిన కారు.. బైకును ఢీకొట్టింది. అనంతరం ట్రాన్స్ఫార్మర్ను గుద్దింది. దీంతో ఇద్దరు గాయపడ్డారు.
ప్రమాదం దాటికి ట్రాన్స్ ఫార్మర్, స్తంభాలు పడిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కాగా, ప్రమాదానికి కారణమైన కారులో భారీగా గుట్కా ప్యాకెట్లు లభించాయి. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.