హైదరాబాద్: తొమ్మిది సంవత్సరాల క్రితం సరిగ్గా ఇదే రోజు చరిత్ర సృష్టించామని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్రావు ట్వీట్ చేశారు. 2014 ఫిబ్రవరి 18న లోక్సభలో తెలంగాణ బిల్లుకు ఆమోదం లభించిన సందర్భాన్ని మంత్రి ట్విటర్లో ఉటంకించారు.
‘విజనరీ నాయకుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో నడిచిన ప్రజా ఉద్యమం ఇవాళ్టి రోజు విజయం సాధించింది. 2014 ఫిబ్రవరిలో ఇదే రోజున లోక్సభలో తెలంగాణ బిల్లుకు ఆమోదం లభించింది’ అని మంత్రి హరీష్రావు తన ట్వీట్లో పేర్కొన్నారు. లోక్సభలో తెలంగాణ బిల్లుకు ఆమోదం లభించిన సందర్భంగా విజయ సంకేతాన్ని చూపుతూ కేసీఆర్, ఇతర నాయకులతో దిగిన ఫొటోను మంత్రి షేర్ చేశారు.
On this very day 9 years ago, history was created.
The peoples movement led by the visionary leader and now CM Shri #KCR garu won when #TelanganaBill was approved in Lok Sabha on this day 18-02-2014. pic.twitter.com/KCMeCBJu1u
— Harish Rao Thanneeru (@BRSHarish) February 18, 2023