ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా హరితహారం పితామహుడు, సీఎం కేసీఆర్ స్వయంగా మొక్క నాటడం కన్నా మించిన ఆనందం మరొకటి లేదు. గ్రీన్ చాలెంజ్ సృష్టికర్తగా ఇది నాకు గౌరవప్రదమైన విషయం. మొక్క నాటిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు.
-ట్విట్టర్లో ఎంపీ సంతోష్కుమార్
హైదరాబాద్, జూన్5 (నమస్తే తెలంగాణ): సృష్టికి మూలమైన ప్రకృతిని పదిలంగా కాపాడుకున్నప్పుడే భవిష్యత్ తరాలు సుఖసంతోషాలతో వర్ధిల్లుతాయని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురసరించుకుని కోకాపేట్లోని హెచ్ఎండీఏ లేఅవుట్ నియోపొలిస్లో సోమవారం మధ్యాహ్నం సీఎం మొకను నాటా రు. గ్రీన్ఇండియా చాలెంజ్ ఫౌండర్ ఎంపీ సంతోష్కుమార్, అర్బన్ ఫారెస్ట్ డైరెక్టర్ డాక్ట ర్ ప్రభాకర్ అందించిన మూడేండ్ల వయసు న్న 7.5 అడుగుల ‘పొన్న’ మొకను సీఎం నాటారు. పచ్చదనం పెంపు, పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టాల్సిన చర్యలను నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని ఈ సందర్భంగా ప్రజలకు కేసీఆర్ పిలుపునిచ్చారు. పంచభూతాల్లో భాగమైన నీరు, ప్రాణవాయువును కొనుకొనే దుస్థితికి ప్రపంచం చేరడానికి మానవ తప్పిదాలే కారణమని అన్నా రు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యలతో రాష్ట్రంలో పచ్చదనం పెరిగి, జీవ వైవిధ్యం పరిఢవిల్లుతున్నదని తెలిపారు. హరితహారం తో రాష్ట్రంలో గ్రీన్కవర్ 7.7 శాతానికి పెరిగిందని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక వెల్లడించిందని గుర్తుచేశారు. ఇది తెలంగాణ ప్రజల పర్యావరణ పరిరక్షణ దీక్షకు దర్పణం పడుతున్నదని చెప్పారు.
సౌర విద్యుదుత్పత్తిలో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో నిలవడం గొప్ప విషయమని సీఎం కేసీఆర్ అన్నారు. బృహత్ ప్రకృతివనాలపై నీతి ఆయోగ్ ప్రశంసలు, 273 కోట్ల మొకలను నాటడం ద్వారా హరితహారం ప్రపంచంలోనే అతిపెద్ద మానవ ప్రయత్నంగా రికార్డులకెకడం, ‘సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్’ నివేదికలో పర్యావరణ పరిరక్షణలో రాష్ట్రానికి ప్రథమస్థానం దకడం వంటి విజయాలన్నీ తెలంగాణ ప్రభుత్వానికి పర్యావరణ పరిక్షణపై ఉన్న నిబద్ధతను చూపుతున్నాయని చెప్పారు. పర్యావరణహిత రాష్ర్టాన్ని ఆవిషరించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని సీఎం స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ కే కేశవరావు, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ప్రశాంత్రెడ్డి, మల్లారెడ్డి, గ్రీన్ఇండియా చాలెంజ్ ఫౌండర్, ఎంపీ సంతోష్కుమార్ తదితరులు పాల్గొన్నారు.