హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): ఏ స్థాయి ప్రభుత్వ ఉద్యోగి అయినా.. అవినీతికి పాల్పడకుండా, నిజాయితీగా విధులు నిర్వర్తిస్తూ సామాన్య పౌరులకు భద్రత, భరోసా కల్పించాలని ఏసీబీ డీజీ సీవీ ఆనంద్ ఆకాక్షించారు. ప్రభుత్వ ఉద్యోగులు లంచం తీసుకోకుండా పనిచేసే రోజులు రావాలని శనివారం ‘ఎక్స్’ వేదికగా కోరారు. అభాగ్యులను అనవసరంగా వేధిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులను.. మరో ప్రభుత్వ ఉద్యోగే అరెస్టు చేసి జైలుకు పంపండం కూడా అత్యంత బాధాకరమైన విధి నిర్వహణేనని ఆయన చెప్పారు.