Mana Yatri App | హైదరాబాద్,ఫిబ్రవరి 29 (హైదరాబాద్) : హైదరాబాద్లో తొలిసారిగా జీరోకమీషన్ ఆధారిత ఆటో క్యాబ్ యాప్ ‘మనయాత్రి’ని గురువారం టీహబ్లో ప్రారంభించారు. డ్రైవర్లను ఆర్థికంగా బలోపేతం చేయడం, నగర ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడం ఈ యాప్ లక్ష్యంగా పెట్టుకొన్నది. ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్ డీసీ)లో భాగమైన ఈ యాప్ను బెంగళూరులోని ‘నమ్మయాత్ర’ సాధించిన స్ఫూర్తితో టీ-హబ్లో రూపొందించారు.
ఈ సందర్భంగా ఓఎన్డీసీ సీఈవో టీ కోషి మాట్లాడుతూ.. ‘హైదరాబాద్ సంసృతి, ఇక్కడి సాంకేతిక నిపుణులకు మనయాత్రి సరిగ్గా సరిపోతుందని తెలిపారు. ఇది సమీకృత డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు దోహద పడుతుందని పేర్కొన్నారు. జస్ట్ పే సంస్థలో చీఫ్గ్రోత్ ఆఫీస ర్ ఎంఎస్ షాన్ మాట్లాడుతూ..‘మనయాత్రి’ అనేది కేవలం ఒక యాప్ మాత్రమే కాదని, ఇది హైదరాబాదీ డ్రైవర్లు, పౌరుల జీవితాలను మెరుగుపరిచే ఒక ఉద్య మమని తెలిపారు. మనయాత్రి ఇప్పటికే హైదరాబాద్లో 25వేల మందికి పైగా డ్రైవర్లను చేర్చుకొన్నదని తెలిపారు. మరో లక్ష మందిని రాబోయే మూడు నెలల్లో చేర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకొన్నదని వెల్లడించారు. హైదరాబాద్ ప్రజల అవసరాలకు అనుగుణంగా కస్టమైజ్ చేసేందుకు టీ-హబ్తో కలిసి పనిచేస్తున్నట్టు యాప్ నిర్వాహకులు తెలిపారు. వివరాలకు www.naamyatri.inను సంప్రదించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీ హబ్ సీఈవో మహంకాళి శ్రీనివాస రావు, ప్రభుత్వ ప్రతినిధులు, డ్రైవర్ల యూనియన్ల సభ్యులు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.