1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. ఆ చారిత్రక ఘట్టం హైదరాబాద్ ప్రజల్లోనూ ఆనందాన్ని కలిగించింది. కొందరు పంద్రాగస్టు వేడుకలను జరుపుకోవాలని ఉత్సాహంగా ఉన్నారు.
వారిలో ఒకరైన నరసింహులు అనే యువకుడు 1 సెప్టెంబర్ 1947న బ్రిటిష్ రెసిడెన్సీకి ఎదురుగా సుల్తాన్ బజార్లో ఉన్న క్లాక్ టవర్ తాళాలు పగులగొట్టి మెట్లెక్కిండు. టవర్పై మువ్వన్నెల జెండా రెపరెపలాడించిండు.