హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): జాతీయ వంట నూనెల అభివృద్ధి మిషన్లో భాగంగా ఈ నెల 28న హైదరాబాద్ వేదికగా ఆయిల్పామ్ బిజినెస్ సమ్మిట్ నిర్వహించనున్నట్టు తెలంగాణ ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రామ్రెడ్డి తెలిపారు. దేశ వ్యాప్తంగా ఆయిల్పామ్ సాగు పెంపు, నూతన ఎడిబుల్ ఆయిల్ విధానంపై సమావేశంలో చర్చించనున్నారు. ఏపీ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఒడిశా, గుజరాత్, ఛత్తీస్గఢ్, గోవా రాష్ర్టాల వ్యవసాయ మంత్రులతోపాటు కేంద్ర ప్రతినిధులు, ఇతర అధికారులు, రైతులు పాల్గొంటారని తెలిపారు.