రాష్ట్ర విద్య, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం మెయిల్ ఐడీ హ్యాకింగ్కు గురైందని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. కొందరు మోసగాళ్లు ఈ మెయిల్ ఐడీని హ్యాక్ చేయడం ద్వారా ఉద్యోగులు, సాధారణ ప్రజలకు మెయిల్స్ పంపుతూ డబ్బులు అడుగుతున్నారని, ఇటువంటి వాటికి స్పందించకుండా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఇటువంటి ఈ-మెయిల్, వాట్సాప్ ద్వారా ఎవరైనా సంప్రదిస్తే వెంటనే వాటిని బ్లాక్ చేయాలని, ఇలా మోసపూరిత మెయిల్స్ పంపేవారిని ఎవరైనా గుర్తిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు.