భద్రాద్రి కొత్తగూడెం : లక్షన్నర విలువైన నారవేప కలపను(Nara Vepa wood) అటవీ శాఖ అధికారులు (Forrest Officials) ఆదివారం పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు(Yellandu) అటవీ ప్రాంతంలోని రోల్లపాడు వద్ద నారవేప కలపను ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
కొంతమంది దుండగులు అడవిలోని చెట్లు కొట్టి ట్రాక్టర్పై ఇల్లందులోని టింబర్ డిపోకు అక్రమంగా తరలిస్తుండగా చాకచక్యంగా పట్టుకున్నారు. కలప విలువు సుమారు 1.50 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. అక్రమ కలప రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.