హైదరాబాద్, ఫిబ్రవరి20 (నమస్తే తెలంగాణ): ఓసీలను రాజకీయంగా అణచివేసేందుకు భారీ కుట్ర జరుగుతున్నదని ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు కరుణాకర్రెడ్డి ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓసీలు 20శాతం సీట్లు మాత్రమే గెలువడంపై శుక్రవారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు.
రానున్న పరిషత్ ఎన్నికల్లోనూ ఇదే తరహాలో రాజకీయ పార్టీలు వ్యవహరిస్తే సహించేది లేదని, ఓసీలను చైతన్యపరిచి ఉద్యమిస్తామని హెచ్చరించారు.