హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ): భారత జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేపట్టిన ‘మహిళా రిజర్వేషన్ బిల్లు’ ఉద్యమానికి ప్రపంచవ్యాప్తంగా ఎన్నారైలు మద్దతు ఇస్తున్నారని బీఆర్ఎస్ ఎన్నారై గ్లోబల్ కో-ఆర్డినేటర్ మహేశ్ బిగాల పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఎన్నారై గ్లోబల్ కో-ఆర్డినేటర్ ఆస్ట్రేలియా మహిళా విభాగం అధ్యక్షురాలు సంగీత ధూపాటి ఆధ్వర్యంలో ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ఎమ్మెల్సీ కవిత ఉద్యమానికి మద్దతుగా పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎన్నారై గ్లోబల్ కో-ఆర్డినేటర్ మహేశ్ బిగాల మాట్లాడుతూ ఎన్నారైల మద్దతును కూడగట్టి కేంద్రంపై ఒత్తిడి తేవటమే లక్ష్యంగా తమ కార్యాచరణ ఉంటుందని తెలిపారు. తెలంగాణ సంసృతీసంప్రదాయాల విశిష్టతను ఖండాంతరాలకు వ్యాప్తిచెందేలా ఎమ్మెల్సీ కవిత కృషి చేసిన విషయాన్ని బీఆర్ఎస్ ఎన్నారై సెల్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై విభాగం ఉపాధ్యక్షుడు రాజేశ్గిరి రాపోలు, కన్వీనర్ రవిశంకర్ ధూపాటి, లివింగ్స్టన్ చెట్టిపల్లి, అమ్రీన్, గుల్షన్ ఆర, స్వప్న నెల్లీ, పరశురామ్, ఇజాజ్, ఇస్మాయిల్, చిరాన్ పురంశెట్టి తదితరులు పాల్గొన్నారు.