హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): మాంసంలో కల్తీని పసిగట్టే నూతన టెక్నాలజీని జాతీయ మాంస పరిశోధన కేంద్రం (ఎన్ఆర్సీఎం) ఆవిష్కరించింది. చెంగిచెర్ల కేంద్రంగా మాంసం ఉత్పత్తులపై పరిశోధనలు, అధ్యయనం చేసే ఈ సంస్థ ఎం-ఆర్ఎన్ఏ (మెసెంజర్-రైబో న్యూక్లిక్ యాసిడ్) ద్వారా మాంసం కల్తీని గుర్తించే విధానాన్ని అభివృద్ధి చేసింది.
ఈ ఎం-ఆర్ఎన్ఏ విధానంలో మాంసం నాణ్యతను పరీక్షిస్తే అందులో ఆయా జంతు శరీరంలోని ఏ మాంసం ఎంత మేర కలిసిం దనే విషయాన్ని కూడా స్పష్టంగా తెలుసుకొనే వీలుం టుందని ఎన్ఆర్సీఎం శాస్త్రవేత్త విష్ణురాజ్ తెలిపారు. ఈ అధ్యయనం ఫలితాలు ‘జర్నల్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ’లో ప్రచురితమయ్యాయి.