పేటీఎం, యూపీఐ ఆప్షన్లతో టికెట్ పొందే అవకాశం
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 10 : ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే క్యూఆర్ కోడ్ ద్వారా ఆటోమెటిక్ టికెట్ వెం డింగ్ యంత్రం నుంచి రైలు టికెట్ కొనుగోలుచేసే సదుపాయాన్ని తీసుకొచ్చింది. స్మార్ట్కార్డు ఆటోమెటిక్ వెండింగ్ మిషన్ విధానం నుంచి క్యూఆర్ కోడ్ విధానాన్ని అప్గ్రేడ్ చేసినట్టు గురువారం దక్షిణ మ ధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. పేటీఎం, యూపీఐ, ఫ్రీచార్జ్ వంటి ఆప్షన్ల ద్వారా అన్ రిజర్వ్డ్ టికెట్లు పొందవచ్చని దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజీవ్కిశోర్ సూచించారు
ఏప్రిల్ 15 నుంచి ‘బాలాజీ దర్శన్ టూర్’
ఏప్రిల్ 15 నుంచి 17 వరకు తిరుపతి బాలాజీ దర్శన్ టూర్ నిర్వహించనున్నట్టు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. విశాఖపట్నం నుంచి తిరుపతికి ప్రత్యేక రైలును ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నది.