హైదరాబాద్ : తెలంగాణలో కొలువుల జాతర కొనసాగుతూనే ఉంది. న్యూఇయర్ వేళ నర్సింగ్ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త వినిపించింది. 5,204 స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు జనవరి 25 నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు. డీఎంఈ, డీహెచ్ పరిధిలో 3,823 పోస్టులను భర్తీ చేయనున్నారు. వైద్య విధాన పరిషత్లో 757 పోస్టులను భర్తీ చేయనున్నారు.