హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రం నుంచి వచ్చే నెల 21తో పదవీకాలం ముగియనున్న రెండు రాజ్యసభ స్థానాలకు మం గళవారం నోటిఫికేషన్ విడుదల కానున్నది. ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ మొదలవుతుందని ఎన్నికల కమిషన్ ఇంతకు ముందే ప్రకటించింది. టీఆర్ఎస్ అభ్యర్థులుగా తెలంగాణ పబ్లికేషన్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ దీవకొం డ దామోదర్రావు, హెటిరో డ్రగ్స్ వ్యవస్థాపకుడు బండి పార్థసారధిరెడ్డి బుధవారం ఉద యం 11 గంటలకు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. దేశవ్యాప్తంగా 57 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రం నుంచి కెప్టెన్ లక్ష్మీకాంతారావు, డీ శ్రీనివాస్ పదవీ కాలం వచ్చే నెల 21తో ముగియనున్నది.