నిజామాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే పత్రికలకు లోక్సభ హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇవ్వడం సిగ్గుచేటని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. ప్రధాని మోదీ రాజ్యసభలో మాట్లాడుతూ తెలంగాణపై మాట్లాడిన అంశాలను నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే పత్రికలు వక్రీకరించాయని పేర్కొంటూ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఫిర్యాదు చేయడంపై ఆయన భగ్గుమన్నారు. పత్రికల్లో వాస్తవాలు రాస్తే బెదిరింపు చర్యలకు పాల్పడటం కేంద్ర ప్రభుత్వానికి తగదన్నారు. పత్రికా స్వేచ్ఛకు, ప్రజాస్వామ్య విలువలకు తిలోదకా లు ఇస్తున్న బీజేపీకి బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయ ని హెచ్చరించారు. బుధవారం మంత్రి నిజామాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ఏర్పాటు ప్రక్రి య సరిగా జరగలేదని, తెలంగాణ పుట్టుకనే ప్రశ్నించి ఈ ప్రాంత ప్రజలను ప్రధాని మోదీ అవమానపరుస్తుం టే బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారని, ఈ ప్రాంత బిడ్డలుగా ప్రధానిని అడగాల్సిన కనీస ఇంగిత జ్ఞానం లేదా? అని ప్రశ్నించారు. ఎంపీ అర్వింద్ నాలుకకు మెదడుకు కనెక్షన్ కట్ అయ్యినట్టు ఉన్నదని, ఏం మాట్లాడుతున్నాడో అతనికే తెలియడం లేదన్నారు. అసలు తెలంగా ణ బిడ్డవేనా? ఎందుకంత కండకావరం అని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఓ డ్రామా ఆర్టిస్ట్ అని మం త్రి వేముల అభివర్ణించారు. మోదీ వల్ల దేశానికి లాభం కన్నా నష్టమే ఎక్కువ ఉన్నదని మండిపడ్డారు. రాష్ర్టా ల నుంచి రాజ్యాంగబద్ధమైన అధికారాలు తీసుకోవ డం, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను కేంద్రమే చేస్తున్నదని దొంగ ప్రచారాలు చేయటం సిగ్గుమాలిన చర్యగా పేర్కొన్నారు. దేశంలో కేసీఆర్ ఆలోచనలతో కలిసి వచ్చే నాయకులు రోజురోజుకూ పెరుగుతున్నారని తెలిపారు. త్వరలోనే దేశానికి ఎజెం డా నిర్ణయిస్తారని పేర్కొన్నారు. తెలంగాణలో అమలవుతున్న పనులే యావత్ దేశానికి అమలయ్యే విధంగా కేసీఆర్ కృషి చేస్తున్నారని మంత్రి తెలిపారు.
టీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి మాట్లాడుతూ.. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే పత్రికలపై ఎంపీ అర్వింద్ ఫిర్యాదు చేయటంపై మండిపడ్డారు. ఉన్నది ఉన్నట్టు రాస్తే వక్రీకరించారనడంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశా రు. పత్రికలకు లోక్సభ హక్కుల ఉల్లంఘన నోటీసు లు జారీ కావడం బాధాకరమన్నారు.