హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): బాలల హకుల కమిషన్ చైర్మన్, సభ్యుల నియామకాలకు విధించిన నిబంధనలను సవాల్ చేసిన కేసులో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీచేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మహిళా శిశు సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్లకు నోటీసులు పంపింది. కమిషన్ చైర్మన్, సభ్యుల పదవులకు కనీసం పదేండ్ల అనుభవం ఉండాలన్న నిబంధన 3(1)ను సవాల్ చేస్తూ కే అఖిల్, శ్రీగురుతేజ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే అనిల్కుమార్తో కూడిన ధర్మాసనం గురువారం విచారించింది.