హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ):ప్రగతిభవన్లో గురువారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావును నల్లగొండ- రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల సహాయ సహకార యూనియన్ (నార్మూల్) చైర్మన్గా ఎన్నికైన గంగుల కృష్ణారెడ్డి, డైరెక్టర్లు మంత్రి జగదీశ్రెడ్డి ఆధ్వర్యంలో కలిశారు. వీరి వెంట విప్ గొంగిడి సునీతా మహేందర్రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్రెడ్డి, శానంపూడి సైదిరెడ్డి, రవీంద్రకుమార్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, నార్మూల్ మాజీ చైర్మన్ గుత్తా జితేందర్రెడ్డి, కొత్త డైరెక్టర్లు కర్నాటి జయశ్రీ, అలివేలు, కోట్ల జలంధర్రెడ్డి, రచ్చా లక్ష్మీనరసింహారెడ్డి, గూడూరు శ్రీధర్రెడ్డి, చల్లా సురేందర్రెడ్డి తదితరులు ఉన్నారు.