కరీంనగర్ కార్పొరేషన్, ఏప్రిల్ 20: ఏడాదిన్నరగా కరోనా ఇబ్బంది పెడుతున్నా రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుకు ఆటంకం కలుగలేదని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టంచేశారు. మంగళవారం కరీంనగర్లోని సప్తగిరికాలనీ ప్రభుత్వ పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ను మేయర్ వై సునీల్రావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రతి ఇంటికీ అందుతున్న మంచినీరు, సంక్షేమ ఫలాల్లో సీఎం కేసీఆర్ కనిపిస్తున్నారని, 99 శాతం మంది ప్రజలు కేసీఆర్ త్వరగా కోలుకోవాలని దేవున్ని ప్రార్థిస్తున్నారని చెప్పారు.