హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి ప్రారం భం కానున్న ప్రజాపాలనను పర్యవేక్షించేందుకు ప్రభుత్వం నోడల్ ఆఫీసర్లను నియమించింది. ఉమ్మడి జిల్లాలవారీగా ఐఏఎస్లకు బాధ్యతలను అప్పగిస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దేవసేనకు కరీంనగర్, టీకే శ్రీదేవికి మహబూబ్నగర్, రఘునందన్రావుకు ఖమ్మం, ఈ శ్రీధర్కు రంగారెడ్డి, వాకాటి కరుణకు వరంగల్, నిర్మలకు హైదరాబాద్, సంగీతకు మెదక్, ప్రశాంతికి ఆదిలాబాద్, ఆర్వీ కర్ణన్కు నల్లగొండ, క్రిస్టినా జడ్ చోంగ్తూకు నిజామాబాద్ జిల్లా బాధ్యతలు అప్పగించింది. వీరంతా ఆయా జిల్లాల్లో పర్యటించి ప్రజాపాలనపై అధికారులకు అవగాహన కల్పించాలని, దరఖాస్తుల విధానాన్ని పర్యవేక్షించాలని సూచించింది. హైదరాబాద్ లో జోన్లవారీగా ఐఏఎస్లను నియమించింది.