Navdeep | హైదరాబాద్/హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): మాదక ద్రవ్యాల కేసులో నిందితుడు, సినీనటుడు పల్లపోలు నవదీప్పై కఠిన చర్యలు తీసుకోరాదని పోలీసులకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కేసు దర్యాప్తు చేయాలని భావిస్తే సీఆర్పీసీలోని 41ఏ నోటీసు జారీ చేశాకే విచారణ చేయాలని స్పష్టం చేసింది. గుడిమలాపూర్ పోలీసులు నమోదు చేసిన మాదక ద్రవ్యాల కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ నవదీప్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని బుధవారం జస్టిస్ కే సురేందర్ విచారణ జరిపారు.
మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా పోలీసులు నవదీప్ను 20వ నిందితుడిగా చేర్చారని, పరారీలో ఉన్నట్టు చెబుతున్నారని ఆయన తరఫు న్యాయవాది చెప్పారు. రిమాండ్ రిపోర్టులో మాదకద్రవ్యాల వినియోగదారుడిగా పేరొన్నారని, సరఫరాదారుగా పేరొనలేదని తెలిపారు. పిటిషనర్కు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఈ వాదనను అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సారా సుదర్శన్ వ్యతిరేకించారు. నవదీప్ను విచారిస్తే మరిన్ని లింక్లు బయటకు వచ్చే అవకాశాలున్నాయని పోలీసులు భావిస్తున్నారు.