దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లయినా ప్రజాస్వామ్యం పరిణతి పొంది, అధికారాల వికేంద్రీకరణ జరగలేదు. పైగా నిరంకుశ పోకడలు పెరిగి అధికారాలు మరింత కేంద్రీకృతమవుతున్నాయి. సమాఖ్య స్ఫూర్తి కుంచించుకు పోతున్నది. ‘బలమైన కేంద్రం – బలహీన రాష్ట్రాలు’ అనే కుట్రపూరిత సిద్ధాంతాన్ని కేంద్ర ప్రభుత్వాలు అమలుచేశాయి.
పటిష్టమైన ఆర్థిక క్రమశిక్షణతో 17.24% ఆర్థిక వృద్ధిరేటు సాధించాం. ఆర్థిక వృద్ధిరేటు విషయంలో తెలంగాణ దేశంలో అగ్రస్థానంలో నిలిచింది. ఎన్ని అవరోధాలు ఎదురైనా, కరోనావంటి విపత్తులు వచ్చినా రాష్ట్రం ప్రగతిపథంలో దూసుకుపోతున్నది. కరోనా సంక్షోభం నుంచి అతి త్వరగా తెలంగాణ కోలుకొన్నదని భారత ఆర్థిక సర్వే 2020-21 అభినందించడం ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ దక్షతకు దకిన గుర్తింపు. 2013-14లో తెలంగాణ జీఎస్డీపీ రూ.5,05,849 కోట్లు. 2021-22 నాటికి రూ.11,54,860 కోట్లకు చేరింది. పెరిగిన ఆదాయంలో ప్రతి పైసా సద్వినియోగం అయ్యేలా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ఖర్చుచేస్తున్నది.
ప్రపంచమంతా నియంతృత్వాలు నశించి ప్రజాస్వామ్యాలు విలసిల్లుతుంటే మన దేశంలో అందుకు విరుద్ధంగా జరుగుతున్నది.
– రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్
హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ర్టాలపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆర్థిక వివక్ష పాటిస్తున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మండిపడ్డారు. రాష్ర్టాలను బలహీనపరిచేందుకు కుట్ర చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మనదేశంతోపాటే స్వాతంత్య్రం పొందిన ఇతర దేశాలు ఇప్పుడు సూపర్ పవర్లుగా వెలిగిపోతుంటే, మనం మాత్రం ఇంకా కులం, మతం రొంపిలో కుమ్ములాడుకొంటున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. కుల, మతాల కొట్లాటల్లోంచి దేశాన్ని బయటపడేసి, ఉజ్వల ప్రగతి వైపు పరుగులు పెట్టించే సమయం ఆసన్నమైందని చెప్పారు. సమస్త తెలంగాణ ప్రజలకు అభివృద్ధి ఫలాలు పంచుతున్న ‘తెలంగాణ ఎజెండా’ దేశమంతా అమలు కావాలని ఆకాంక్షించారు. ఉజ్వల భారత నిర్మాణం కోసం జరిగే ఈ పోరాటంలో తెలంగాణ ప్రజలే అగ్రభాగాన నిలువాలని పిలుపునిచ్చారు. గురువారం తెలంగాణ రాష్ట్ర అవరతరణ దినోత్సవాల్లో భాగంగా పబ్లిక్ గార్డెన్స్లో నిర్వహించిన వేడుకల్లో ఆయన ప్రజలకు సందేశమిచ్చారు. తెలంగాణపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సమైక్య పాలకులు వివక్ష చూపితే, స్వరాష్ట్రంలో కేంద్రప్రభుత్వం అదే పని చేస్తున్నదని విమర్శించారు.
ఎఫ్ఆర్బీఎం నిబంధనలను రాష్ట్రాలు విధిగా పాటించాలని శాసిస్తున్న ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం, తను మాత్రం ఏ నియమాలకూ కట్టుబడకుండా విచ్చలవిడిగా అప్పులు చేస్తున్నదని సీఎం కేసీఆర్ ఆరోపించారు. రుణాలు, పెట్టుబడి వ్యయాలు ఎఫ్ఆర్బీఎం పరిమితులకు లోబడే నిర్వహిస్తూ, ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తున్న తెలంగాణ వంటి రాష్ట్రాలకు కేంద్రం వైఖరి గుదిబండలా తయారయిందని మండిపడ్డారు. కేంద్రం వెంటనే పునరాలోచించి రాష్ట్రాలపై విధిస్తున్న ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కేంద్రానికి తలొగ్గి రైతు వ్యతిరేక విద్యుత్తు సంసరణలు అమలుచేయక పోవడం వల్ల తెలంగాణ ఏటా రూ.5 వేల కోట్లు సమకూర్చుకొనే అవకాశం కోల్పోయిందని గుర్తుచేశారు. ఐదేండ్ల్లలో రూ.25 వేల కోట్లు నష్టపోవలసి వస్తున్నదని, ఈ రూ.25 వేల కోట్ల కోసం చూసుకొంటే బాయిలకాడ మీటర్లు పెట్టి రైతుల నుంచి విద్యుత్తు చార్జీలు వసూలు చేయాల్సి వస్తుందని తెలిపారు. అది మన విధానం కాదని, రైతులమీద భారం వేసే చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని స్పష్టంచేశారు. తన కంఠంలో ప్రాణమున్నంత వరకు రైతాంగానికి నష్టంచేసే విద్యుత్తు సంసరణలను అంగీకరించేది లేదని తేల్చిచెప్పారు.
దేశానికి నేడు ఒక సామూహిక లక్ష్యం లేకుండా పోయిందని, చుకాని లేని నావలా గాలివాటుకు దేశం కొట్టుకు పోతున్నదని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. ‘75 ఏండ్ల స్వాతంత్రం తర్వాత ఇంకా మన దేశాన్ని దారిద్య్ర బాధ ఎందుకు పీడిస్తున్నది? సుసంపన్నమైన వనరులు ఉండి, కష్టంచేసే ప్రజలు ఉండి వినియోగించుకోలేని అసమర్థతకు బాధ్యులు ఎవరు? దేశాన్ని నడిపించటంలో వైఫల్యం ఎవరిది ? విజ్ఞులైన దేశ పౌరులు ఈ విషయాలపై గంభీరంగా ఆలోచించవలసిన అవసరం ఉన్నది’ అని పేర్కొన్నారు. దేశానికి కావాల్సింది ఐదేండ్లకోసారి అధికార కూటమి మారటం కాదని, సమస్యలకు పరిషారం చూపే ప్రగతిశీల ఎజెండా కావాలని స్పష్టంచేశారు. మనతోపాటు స్వాతంత్రం సాధించుకొన్న కొన్ని దేశాలు సూపర్ పవర్లుగా ఎదుగుతుంటే, మనమింకా కులమత రొంపిలోనే కొట్లాడుకొంటున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. ‘ఇప్పడు దేశం ప్రమాదకర పరిస్థితిలో ఉన్నది. విద్వేష రాజకీయాల్లో చికి విలవిలలాడుతున్నది. మత పిచ్చి తప్ప వేరే చర్చ లేదు. ప్రజల అవసరాలు ప్రాతిపదిక కాకుండా పోయాయి. మత ఘర్షణల ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలనే ఎజెండా చాలా ప్రమాదకరం.
విచ్ఛిన్నకర శక్తులు ఇలాగే పెట్రేగితే సమాజ ఐక్యత ప్రమాదంలో పడుతుంది. అశాంతి ప్రబలితే అంతర్జాతీయ పెట్టుబడులు రావు సరికదా ఉన్న పెట్టుబడులు వెనకు వెళ్లిపోతాయి. విదేశాల్లో ఉపాధి పొందుతున్న కోట్లమంది భారతీయుల మనుగడకు ముప్పు ఏర్పడుతుంది. ఈ విద్వేష వాతావరణం దేశాన్ని వందేండ్లు వెనక్కు తీసుకపోవడం ఖాయం. ఆజన్మాంతం తెలంగాణ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకోవటం నా విధి. అదే సమయంలో దేశ ప్రయోజనాల కోసం, విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాటం కూడా మనందరి బాధ్యత. సమస్త ప్రజలకు సంక్షేమ, అభివృద్ధి ఫలాలను పంచుతున్న తెలంగాణ ఎజెండా దేశమంతా అమలు కావాలి. ఉజ్వల భారత దేశ నిర్మాణం కోసం జరిగే పోరాటంలో తెలంగాణ ప్రజలు అగ్రభాగాన నిలవాలి’ అని పిలుపునిచ్చారు. నిత్య ఘర్షణలు, కొట్లాటలతో దేశం నాశనమవుతుంటే బాధ్యత కలిగిన వారెవరూ చూస్తూ ఊరుకోలేరని సీఎం అన్నారు. ప్రజలకు కావాల్సింది కరెంటు, మంచినీళ్లు, ప్రాజెక్టులు, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలని, దేశం ప్రగతి పథంలో పరుగులు పెట్టాలంటే నూతన వ్యవసాయ, పారిశ్రామిక, ఆర్థిక విధానాలు కావాలని, అందుకు తగు వేదికలు రావాలని, కొత్త సామాజిక, ఆర్థిక, రాజకీయ ఎజెండా కోసం దారులు వెతకాలని అన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంతర్భాగంగా ఉన్నపుడు సమైక్య పాలకులు తెలంగాణపై వివక్ష చూపితే, స్వరాష్ట్రంలో కేంద్రప్రభుత్వం అదే పని చేస్తున్నదని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్ర తొలి ఆవిర్భావ వేడుకలైనా జరుపుకోకముందే ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను నరేంద్రమోదీ సర్కారు ఆంధ్రప్రదేశ్కు అన్యాయంగా కట్టబెట్టిందని, దీనివల్ల లోయర్ సీలేరు విద్యుత్తు ప్రాజెక్టును మనం కోల్పోయామని గుర్తుచేశారు. నాటి నుంచి నేటి వరకు తెలంగాణ హకుల సాధనకు కేంద్రంతో ఏదో ఒక రకంగా పోరాడవలసి వస్తున్నదని తెలిపారు. ఐదేండ్లపాటు హైకోర్టును విభజించకుండా కేంద్రం తాత్సారం చేసిందని మండిపడ్డారు. కరోనా కష్టకాలంలో కూడా రాష్ర్టానికి కేంద్రం ఒక్క పైసా సాయం చేయలేదని విమర్శించారు. రాష్ర్టానికి చట్టబద్ధంగా రావాల్సిన నిధులు కూడా ఇవ్వటంలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం రెండు రాష్ట్రాల్లోని నియోజకవర్గాలను పునర్వ్యవస్థీకరించాలని స్పష్టంగా చెప్పినా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆ ఊసే ఎత్తకుండా కాలయాపన చేస్తున్నదని కేసీఆర్ ధ్వజమెత్తారు. విభజన చట్టంలోని హామీలన్నీ బుట్టదాఖలు చేసిందని మండిపడ్డారు. బయ్యారం స్టీల్ ప్లాంటు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలు అతీగతీ లేవని, ఐటీఐఆర్ ప్రాజెక్టు ఇవ్వకుండా తీరని అన్యాయం చేసిందని ఆరోపించారు. యుద్ధం కారణంగా అర్ధాంతరంగా ఆగిపోయిన మన వైద్య విద్యార్థులకు దేశంలోని మెడికల్ కాలేజీల్లో సీట్లిస్తే ఫీజులన్నీ రాష్ట్రప్రభుత్వమే భరిస్తుందని చెప్పినా కేంద్రం కనీసం పట్టించుకోలేదని విమర్శించారు. కేంద్రం తీరుతో విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తంచేశారు.
తెలంగాణ రైతులు పండించిన పంటను కొనుగోలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం దారుణంగా విఫలమైందని సీఎం కేసీఆర్ అన్నారు. ధాన్యం సేకరించాలని తనతోపాటు ప్రజాప్రతినిధులంతా కలిసి ధర్నా చేసినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. ధాన్యం కొనుగోలు చేయాలని కోరితే తెలంగాణ ప్రజలకు నూకలు తినిపించండి అని ఓ కేంద్రమంత్రి అవహేళనగా మాట్లాడారని, ఇంతకన్నా దురహంకారం మరేమైనా ఉంటుందా? అని ప్రశ్నించారు. అన్నం పెట్టే రైతులు భిక్షగాళ్లు కాదని అన్నారు. పంటల కొనుగోలుకు దేశవ్యాప్తంగా ఒకే విధానం ఉండాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. ‘ప్రభుత్వాలు మాట వినకుంటే రైతులు రోడ్లపైకి వస్తారు. ఎవరితోనైనా పెట్టుకోండి. కానీ, రైతులతో పెట్టుకోవద్దు. కార్పొరేట్లకు కొమ్ముకాస్తూ, రైతులతో చెలగాటమాడే ధోరణిని కేంద్రం ఇకనైనా మానుకోవాలి’ అని సూచించారు. కేంద్రం మొండి చెయ్యి చూపినా తెలంగాణ రైతులను ఆదుకోవటానికి వారు పండించిన ప్రతి గింజ ధాన్యాన్నీ కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వమే నడుం బిగించిందని, ధాన్యం దిగుబడి, కొనుగోళ్లలో రాష్ట్రం కనీవినీ ఎరుగని ప్రగతిని సాధించిందని తెలిపారు.
ప్రపంచమంతా నియంతృత్వాలు నశించి ప్రజాస్వామ్యాలు విలసిల్లుతుంటే మన దేశంలో అందుకు విరుద్ధంగా జరుగుతున్నదని సీఎం కేసీఆర్ అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లయినా ప్రజాస్వామ్యం పరిణతి పొంది అధికారాల వికేంద్రీకరణ జరగలేదని, పైగా నిరంకుశ పోకడలు పెరిగి అధికారాలు మరింత కేంద్రీకృతమవుతున్నాని విమర్శించారు. సమాఖ్య స్ఫూర్తి కుంచించుకు పోతున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పటివరకు కేంద్రంలో గద్దెనెకిన ప్రభుత్వాలన్నీ రాజ్యాంగ స్ఫూర్తిని మంటగలుపుతూ రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని కాలరాశాయని, అధికారాలను నిస్సిగ్గుగా హరించాయని మండిపడ్డారు. రాజ్యాంగంలో కేంద్ర, రాష్ర్టాల అధికారాలు స్పష్టంగా నిర్వచించబడినా, దేశాన్ని పాలించిన అన్ని ప్రభుత్వాలూ రాష్ట్ర జాబితాలోని అంశాలను క్రమంగా ఉమ్మడి జాబితాలోకి లాగేసుకున్నాయని అన్నారు. గతంలో ఏర్పాటు చేసిన సరారియా, పూంచి కమిషన్లు రాష్ట్రాల హకుల రక్షణకు చేసిన సూచనలను కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఏ ప్రభుత్వమూ అమలుచేయలేదని విమర్శించారు. ‘బలమైన కేంద్రం – బలహీన రాష్ట్రాలు’ అనే కుట్రపూరిత సిద్ధాంతాన్ని అమలుచేశాయని మండిపడ్డారు.