యాదాద్రి భువనగిరి : యాదాద్రి కొండపైకి ఇక నుంచి ఆర్టీసీ బస్సుల్లోనే వెళ్లాలని ఆలయ ఈవో తెలిపారు. కొండపైకి ప్రైవేటు వాహనాలను యాదాద్రి దేవస్థానం నిషేధించింది. దీంతో.. ఉచితంగా దేవస్థానం ఏర్పాటు చేసే ఆర్టీసీ బస్సుల్లోనే భక్తులను కొండపైకి తరలిస్తామని ఈవో వెల్లడించారు.
రేపటి నుంచే ఆర్టీసీ బస్సుల ద్వారా కొండపైకి భక్తులను తరలించనున్నారు. భక్తుల తరలింపునకు అయ్యే వ్యయాన్ని దేవస్థానమే భరిస్తుందని ఈవో స్పష్టం చేశారు. త్వరలోనే యాదాద్రి ఆలయంలో స్వామివారి నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, శాశ్వత కల్యాణం. శాశ్వత బ్రహ్మోత్సవం, సుదర్శన నారసింహ హోమంతో పాటు మొక్కు జోడు సేవలు కూడా ప్రారంభిస్తామని ఈవో తెలిపారు.