హైదరాబాద్, ఏప్రిల్ 20, (నమస్తే తెలంగాణ): పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్ (పీవీసీ), పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ (పీసీసీ)లను ఇకపై ఆన్లైన్లో జారీచేసే ‘ఐ వెరిఫై’ విధానాన్ని డీజీపీ ఎం మహేందర్రెడ్డి మంగళవారం ప్రారంభించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వరంగ సంస్థలు, రక్షణ విభాగాలు చేపట్టే ఉద్యోగ నియామకాలకు సర్టిఫికెట్లు ఈ విధానంలో జారీ చేయనున్నారు. ఉద్యోగ, వ్యాపార, ఇమ్మిగ్రేషన్లకు పోలీసులు ఇచ్చే క్లియరెన్స్ సరిఫికెట్లను ఇపై ఈ నూతన విధానం ద్వారా పొందవచ్చని డీజీపీ చెప్పారు. ఈ సేవలు పొందే వ్యక్తులు, సంస్థలు https://www.tspolice.gov.in వెబ్సైట్ ద్వారా వివరాలు తెలుసుకోవచ్చని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ డీజీలు జితేందర్, గోవింద్సింగ్, ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్రావు, ఐజీలు నాగిరెడ్డి, స్టీఫెన్ రవీంద్ర, రాజేశ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.