ప్రతి గంటకు 100 ఇకపై ఉండదు
పార్కింగ్కు రూ.500 యథాతథం
దేవాదాయ శాఖ కమిషనర్ వెల్లడి
యాదాద్రి, మే 4 : యాదాద్రి కొండపైన నాలుగు చక్రాల వాహనాల పార్కింగ్కు ప్రతి గంటకు అదనంగా వసూలు చేసే రూ.100 ఇక ఉండబోదని, కేవలం రూ. 500 రుసుం మాత్రమే వసూలు చేయనున్నట్టు దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్కుమార్ స్పష్టంచేశారు. లడ్డూ ప్రసాద విక్రయశాలలో యంత్రాల పనితీరు, లడ్డూ, పులిహోరకు వినియోగిస్తున్న ముడి సరుకులను బుధవారం ఆయన వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్రావుతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ప్రసాద భవనంలో కావాల్సిన ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకొన్నారు. ఈ సందర్భంగా లడ్డూ తయారీపై సంతృప్తి వ్యక్తం చేశారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు లోపించాయనేది పూర్తి అవాస్తమన్నారు.